బొడ్డు వెంకటరమణ చౌదరికి అమ్మవారి చిత్రపటం బహుకరణ
E.G: రాజానగరం మండలం పల్లకడియం గ్రామం శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొడ్డు వెంకటరమణ చౌదరి మంగళవారం పాల్గొన్నారు. అమ్మవారిని ఎంపీ పురంధేశ్వరితో కలిసి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారి చిత్రపటం బహుకరించారు.