జాతీయ జెండాను ఎగురవేసిన కలెక్టర్

BPT: 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు.