పిడుగురాళ్లలో రేపు ప్రజావేదిక కార్యక్రమం

పల్నాడు: పిడుగురాళ్లలోని మన్యం పుల్లారెడ్డి ZP హైస్కూల్లో ఈనెల 15న ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీధర్ బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, కలెక్టర్ అరుణ్ బాబు, డీప్యూటీ కలెక్టర్, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హాజరవుతారన్నారు. కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.