పురిటిబిడ్డ మృతి.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

పురిటిబిడ్డ మృతి.. కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు

అన్నమయ్య: ములకలచెరువుకు చెందిన అబ్దుల్ సమద్ తన భార్య హీనాకు ప్రసవ నొప్పులు రావడంతో మదనపల్లెలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ హీనా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. శిశువుకు మూర్ఛ రావడంతో వైద్యుల సూచన మేరకు మరో చిన్నపిల్లల ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.