అయినవిల్లి విఘ్నేశ్వరుని సేవలో శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్
కోనసీమ: అయినవిల్లి విఘ్నేశ్వర స్వామివారిని రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ కుడుపూడి సత్తిబాబు సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించే ఆయనకు వేద ఆశీర్వచన అందజేశారు. అదేవిధంగా లక్ష్మీ గణపతి హోమంలో ఆయన పాల్గొని పూజలు నిర్వహించారు.