శాంతియుత ఎన్నికలకు ఫ్లాగ్ మార్చ్: సీఐ
SRPT: ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరిగేలా ప్రజలకు భరోసా కల్పించేందుకు సోమవారం చివ్వేంల గ్రామంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఆత్మకూరు ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం సీఐ రాజశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ప్రచారం సాఫీగా చేసుకోవాలని, ఫలితాల అనంతరం ఊరేగింపులు జరుపరాదని సూచించారు.