‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాపట్ల పట్టణంలోని 22వ వార్డు సంజీవ్ గాంధీ కాలనీ, 23వ వార్డు ఉమ్మారెడ్డి సరోజిని దేవి కాలనీలలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెన్షన్ నగదు అందజేసి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.