హైకోర్టులో బండి సంజయ్కు ఊరట
KNR: కేంద్ర మంత్రి బండి సంజయ్కు హైకోర్టులో ఊరట లభించింది. 2023లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా బండి సంజయ్పై కమలాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. గురువారం కేసుపై తెలంగాణ హైకోర్టు తుదితీర్పు వెలువరిచింది. ఈ కేసు నమోదులో సరైన సెక్షన్లు, దర్యాప్తులో పూర్తి వివరాలు లేనందున కేసును హైకోర్టు కొట్టివేసింది.