కుష్టి వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు: ఆర్డీవో

ఏలూరు: భీమవరం కలెక్టరేట్లో DRO ఉదయ భాస్కర్ రావు వివిధ శాఖల అధికారులతో కుష్టు వ్యాధి నిర్మూలనపై సమన్వయకమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో కుష్టువ్యాధి వ్యాప్తి చెందకుండా, సంపూర్ణంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు కుష్టు వ్యాధిపై సర్వే చేస్తామన్నారు.