మిడ్జిల్‌లో పశువులకు గాలికుంటు టీకాలు

మిడ్జిల్‌లో పశువులకు గాలికుంటు టీకాలు

MBNR: మిడ్జిల్ మండలం కొత్తపల్లి, వేముల, వాడ్యాల, అయ్యవారిపల్లి గ్రామాల్లో మంగళవారం పాడి పశువులు, దూడలకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి శివరాజ్ ఆధ్వర్యంలో పాడి, దుక్కి దున్నే జీవాలకు టీకాలు అందించారు. కార్యక్రమాన్ని ఆయా గ్రామాల సర్పంచులు ప్రారంభించారు. పశుపోషకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.