చల్లపల్లిలో రోశయ్య విగ్రహావిష్కరణ
కృష్ణా: కొణిజేటి రోశయ్య జీవితం ఆదర్శప్రాయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు చిన్ని రామ సత్యనారాయణ అన్నారు. చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఆదివారం రోశయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన కొనియాడారు.