రెండో విడత పోలింగ్ ప్రారంభం
ADB: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదిలాబాద్ రూరల్, బేల, భీంపూర్, భోరాజ్, జైనథ్, మావల, సాత్నాల, తాంసి మండలాల పరిధిలోని 139 గ్రామ పంచాయతీలు, 825 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్కు అవకాశం ఉంది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.