మహాభారత ఉత్సవాలు ప్రారంభం

మహాభారత ఉత్సవాలు ప్రారంభం

CTR: ఎస్‌ఆర్ పురం ద్రౌపదీ సమేత ధర్మరాజుల ఆలయంలో 33వ మహాభారత ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో గణపతి, యజ్ఞ పూజలు నిర్వహించారు. ఈనెల 26 వరకు ఉత్సవాలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రతిరోజు హరికథా కాలక్షేపం, 17 నుంచి రాత్రి వేళల్లో నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. భక్తులు విజయవంతం చేయాలని కోరారు.