'కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యం'
W.G: కార్యకర్తల నిర్ణయమే శిరోధార్యమని వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అన్నారు. ఇవాళ తాడేపల్లిగూడెం తన కార్యాలయం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. జెండా మోసిన కార్యకర్తల సూచనలు, సలహాల మేరకు ముందుకు సాగుతామన్నారు. జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.