నిర్వాహకులతో సీఐ సమావేశం
VZM: శ్రీరాములవారి తీర్థ మహోత్సవ సందర్బంగా నిర్వాహకులను బుధవారం స్టేషన్కు పిలిపించి సీఐ షణ్ముఖరావు పలు సూచనలు చేశారు. ఎటువంటి అల్లర్లులకు పాల్పడకుండా సజావుగా, శాంతి యుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. తీర్థ మహోత్సవ పేరుతో రాజకీయ గొడవలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకొని, కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.