బాధితులకు ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే
ATP: అనంతపురంలో ఓ ప్రముఖ దినపత్రిక విలేకరి రవికుమార్ మరణం పట్ల ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి రవికుమార్ నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారికి తనవంతు రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుంచి ఇల్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.