ప్రేమోన్మాదిపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి
KDP: ఖాజీపేటలో విద్యార్థిని హత్య ఘటనపై జిల్లా ఇంచార్జ్ మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిందితుడు శ్రీనివాస్ చేసిన ఘాతుకాన్ని ఖండిస్తూ.. అతడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై ఉన్మాదంగా ప్రవర్తిస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.