దేవుడు చెరువు ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్
NTR: మైలవరంలోని గత మూడు రోజులుగా మధ్యాహ్న భోజనంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, మైలవరంలోని దేవుడు చెరువు ప్రాథమిక పాఠశాలను బుధవారం డీఈవో తనిఖీ చేసి, విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక విచారం తర్వాత గురువారం పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేస్తూ ఎంఈవో ఉత్తర్వులు జారీ చేశారు.