జిల్లాలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

జిల్లాలో మరింత పెరగనున్న ఉష్ణోగ్రతలు

అనంతపురం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మార్చి రెండో వారం నుంచి ఎండలు తీవ్రస్థాయికి చేరి, 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందన్నారు. వడగాలులు తీవ్రం కావడంతో పాటు వర్షాలు ఆలస్యంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని అంచనా వేశారు.