పారిశుధ్యంపై కమిషనర్ ఫోకస్

పారిశుధ్యంపై కమిషనర్ ఫోకస్

GNTR: పట్టణంలోని 31, 28 వార్డుల్లో ప్రత్యేక పారిశుధ్య పనులను మున్సిపల్ కమిషనర్ రామా అప్పలనాయుడు పరిశీలించారు. కాలువల శుభ్రత, నీటి పంపుల తనిఖీ చేసి సిబ్బందికి సూచనలు ఇచ్చారు. చెత్తను తడి, పొడిగా వేరు చేయాలని, మురుగు పారుదల సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక సమస్యలను కూడా స్వీకరించారు.