ఫైనల్లో శ్రీకాంత్.. సెమీస్లో తన్వి ఓటమి
'సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300' బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఫైనల్కు చేరుకున్నాడు. సెమీస్లో మిథున్ మంజునాథ్పై 21-15, 19-21, 21-13 తేడాతో విజయం సాధించాడు. రేపు జరిగే ఫైనల్లో అతడు జేసన్ గుణవాన్ను ఢీకొట్టనున్నాడు. మరోవైపు, మహిళల సింగిల్స్ విభాగంలో భారత్కు చెందిన 16 ఏళ్ల యువ సంచలనం తన్వి శర్మ ఓటమి పాలైంది.