ప్రజావాణిలో 40 ఫిర్యాదులు

SRD: సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ ప్రావిణ్య , అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 40 మంది తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.