రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
NRPT: మరికల్ 132/33 కేవీ సబ్ స్టేషన్లో విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా గురువారం ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో ఏఈ వెంకటనారాయణ తెలిపారు. వినియోగదారులు సహకరించాలని కోరారు. తీలేరు, ఇబ్రహీంపట్నం, పసుపుల, ఎలిగండ్ల గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.