చెరువుల పూడికతీతకు రంగం సిద్ధం
E.G: సీతానగరం ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం భారతి ఆధ్వర్యంలో ‘నీటి భద్రత’పై సమీక్ష జరిగింది. ఏప్రిల్ 6 నుంచి 100 రోజుల పాటు చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకంతో కాలువల పూడికతీత, కట్టల బలోపేతం చేయాలన్నారు. నీటిమట్టం 3-6 మీటర్లకు పెంచడమే లక్ష్యమని, సాగునీటి సంఘాలు భాగస్వాములు కావాలని కోరారు.