మిడ్జిల్ మండల కేంద్రంలో అత్యధిక వర్షపాతం నమోదు
MBNR: జిల్లాలో గడిచిన 24 గంటలో వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మిడ్జిల్ మండల కేంద్రంలో 119 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జడ్చర్ల 84.8 మి.మీ, కొత్త మొల్గర 82.8 మి.మీ, ఊడిత్యాల 68.0 మి.మీ, దోనూర్ 65.8 మి.మీ, జానంపేట 63.0 మి.మీ, బాలానగర్ 62.3, మహబూబ్ నగర్ 42.5 మి.మీ, దేవరకద్ర 33.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.