ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఆరా..!
హర్మూజ్లోని కేబుళ్లను ఇరాన్.. బాబ్ అల్ మందేబ్ జలసంధిలోని సముద్రగర్భ కేబుళ్లను హూతీలు టార్గెట్ చేసే అవకాశం ఉందని పలు దేశాలు ఆరోపించాయి. దీంతో సబ్సీ కేబుల్ ఆపరేటర్లు, టెలికాం కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. సముద్ర కేబుళ్లలో అంతరాయం ఏర్పడితే భారత్కు కలిగే నష్టాన్ని అంచనా వేసి, అందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని కోరినట్లు సమాచారం.