'ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాయాలి'
NRML: విద్యార్థులు భయపడకుండా పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని నిర్మల్ జిల్లా CPO జీవరత్నం, ఖానాపూర్ ఎంపీడీవో రమాకాంత్, ఎంపిఓ రత్నాకర్ సూచించారు. గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది జెడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలపై అవగాహన కల్పించారు. భయాన్ని వీడి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు బాగా రాస్తే మంచి ర్యాంక్ సాధించవచ్చన్నారు.