అప్పుల భారంతో రైతు ఆత్మహత్య

KRNL: తుగ్గలి మండలంలోని చిన్న జొన్నగిరి గ్రామానికి చెందిన రైతు చెట్నేపల్లి శ్రీనివాసులు (65) అప్పుల భారంతో మనస్తాపానికి గురై బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. మూడెకరాల స్వంత భూమితో పాటు నాలుగెకరాలు భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేసిన ఆయనకు రూ. 14 లక్షల వరకు అప్పులు అయ్యాయి. దీంతో విషం తీసుకుని అనంతపురం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందారు.