అడంగల్ పత్రాలను అందజేసిన కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న వెబ్ల్యాండ్ సమస్యలను జిల్లా యంత్రాంగం పరిష్కరిస్తూ రైతులకు ఊరట కల్పిస్తోంది. మదనపల్లి సబ్ డివిజన్ పరిధిలో సమస్యలు పరిష్కరించిన రైతులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ 1B (అడంగల్) పత్రాలను అందజేశారు. భూ రికార్డులు సరిచేసి రైతులకు పారదర్శక సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు.