అమ్మవారి సేవలో మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర జల వనరుల, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీష్ మహాజన్ ఆదివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ మేరకు వారికి ఆలయం వద్ద సూపరింటెండెంట్ రమేష్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.