జిల్లాలో నేటి పత్తి ధరలు
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ. 8,110గా, ప్రైవేట్ పత్తి ధర రూ. 6,760గా నిర్ణయించారు. బుధవారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేటు ధరలో సైతం ఎలాంటి మార్పు లేదని వెల్లడించారు.