చిరుత దాడిలో మరో లేగ దూడ బలి

చిరుత దాడిలో మరో లేగ దూడ బలి

KMR: గాంధారి మండలం రామలక్ష్మణపల్లి శివారులో సంగీయా నాయక్‌కు చెందిన లేగ దూడను శనివారం రాత్రి చిరుత దాడి చేసి చంపింది. శనివారం సాయంత్రం కొట్టంలో ఆవులను కట్టేసి ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం వచ్చి చూసే సరికి దూడ చనిపోయింది. ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అడుగులను గుర్తించి చిరుత చంపిందని నిర్ధారించారు. బోన్లను ఏర్పాటు చేస్తామన్నారు.