'శానిటేషన్ లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించొద్దు'
JGL: జగిత్యాల పట్టణ మున్సిపాలిటీలోని శానిటేషన్ వాహనాల నిర్వహణలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని మున్సిపల్ ఛైర్పర్సన్ వాణి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కొత్త బస్టాండ్ వాటర్ ట్యాంక్ వద్ద వాహనాలను ఆమె స్వయంగా పరిశీలించారు. సకాలంలో ఆయిల్ చేంజ్ చేస్తూ ఫిట్నెస్ను కాపాడాలని, మరమ్మతుల్లో ఉన్న వాహనాలను వెంటనే అందుబాటులోకి తేవాలని సూచించారు.