VIDEO: ప్రభుత్వ పాఠశాలలపై అవగాహన కార్యక్రమం
KRNL: విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలు బలమైన పునాది అని యూపీ స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు తెలిపారు. శనివారం నందవరంలో ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఇంగ్లిష్ మీడియం బోధనతో పాటు నాణ్యమైన విద్య అందుతున్నదని పేర్కొన్నారు. విద్యార్థులకు ప్రభుత్వం పోషకాహారం, ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని వివరించారు.