అంబేద్కర్ విగ్రహాన్ని అందజేసిన మంత్రి సవిత

అంబేద్కర్ విగ్రహాన్ని అందజేసిన మంత్రి సవిత

సత్యసాయి:పెనుకొండ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం గోరంట్ల మండలం మందలపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన హరిజనులకు మంత్రి సవిత అంబేద్కర్ విగ్రహాన్ని విరాళం అందజేశారు. ఎస్సీ కాలనీకి చెందిన హరిజనులు గ్రామంలో బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా తన తండ్రి ఎస్. రామచంద్రారెడ్డి జ్ఞాపకార్థం విరాళంగా విగ్రహాన్ని అందజేశారు.