హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన
TG: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో హైకోర్టు జోన్-2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్తో కలిసి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. అంతకుముందు హైకోర్టు జోన్-2 భవన నిర్మాణ సముదా నమూనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.