ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలపై దాడులు: ఇరాన్
ఇజ్రాయెల్, అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ 75వ విడత క్షిపణి దాడులు చేపట్టింది. సౌదీలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్లోని అమెరికా స్థావరాన్ని తాము లక్ష్యం చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఇరాన్ ప్రెస్ టీవీ కీలక కథనాన్ని ప్రసారం చేసింది. మధ్యప్రాచ్యంలో తాజా దాడులు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.