బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

BDK: భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు చుంచుపల్లి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని సూచించారు.