ఒంటిమిట్టలో టీడీపీ నాయకుల సంబరాలు

KDP: రాజంపేట నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజును ప్రకటించడంతో ఆయన శుక్రవారం ఒంటిమిట్టలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట పురవీధుల్లో టీడీపీ నాయకులు డాన్సులు వేస్తూ సంబరాలు చేసుకున్నారు. గ్రామస్తులు పుష్పాలు జల్లుతూ వారికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని టీడీపీ అభిమానులు పాల్గొన్నారు.