దేవాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

NLG: ప్రతి ఒక్కరు వేంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం కొండమల్లేపల్లి మండలం గౌరికుంట తండాలో శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.