నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

NZB: రేపు జరగనున్న నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లాలో 3,398 మంది ఈ పరీక్షకు హాజరు కానున్నారని, నిజామాబాద్లో మొత్తం 8 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు.