సిద్దిపేటలో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక ప్రారంభం
SDPT: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. సమస్యలను పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమీషనర్ సూచించారు.