చెట్టుపై ఎలుగుబంటి పిల్ల.. భయాందోళనలో గ్రామస్తులు

చెట్టుపై ఎలుగుబంటి పిల్ల.. భయాందోళనలో గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బర్రివాని తోటలో మునగ చెట్టుపై ఎలుగుబంటి పిల్ల కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. రాత్రి సమయంలో కుక్కలు అరవటంతో మేల్కొన్న గ్రామస్తులు ఎలుగుబంటి పిల్లని గమనించారు. తల్లి ఎలుగుబంటి సమీపంలోనే ఉండే అవకాశం ఉందని, గతంలో ఎలుగుబంటి దాడుల్లో ఇద్దరు మరణించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.