అన్న క్యాంటీన్ను తనిఖీ చేసిన కమిషనర్
చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లిలో ఉన్న అన్న క్యాంటీన్ను కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ బుధవారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. అక్కడ భోజనం చేస్తున్న వారితో మాట్లాడి ఆహారం నాణ్యత గురించి తెలుసుకున్నారు. క్యాంటీన్లో నాణ్యత, శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు.