రెండు బైక్లు ఢీ.. ఒక్కరు మృతి
MLG: మంగంపేట మండలంలోని చుంచుపల్లి శివారులో ఇవాళ ఎదురెదురుగా రెండు బైక్లు వాహనాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో భద్రాద్రి టీ కొత్తగూడెం పినపాక గ్రామానికి చెందిన పానేం ప్రకాష్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ద్విచక్ర వాహనంపై ఉన్న 3 వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని 108 అంబులెన్స్లో ఏటూరునాగారం ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.