'నీటివృథాను చూడగానే వాట్సాప్లో సమాచారం ఇవ్వండి'

KRNL: తాగునీటి పొదుపుకు ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్ర బాబు మంగళవారం తెలిపారు. తాగునీరు వృథా కాకుండా నిరంతరం జాగ్రత్త వహిద్దామన్నారు. పైపులైన్లో ఎక్కడైనా లీకేజీ గమనించిన వెంటనే మరమ్మత్తులు చేయిస్తున్నామన్నారు. ఇందులో ప్రజలు కూడా భాగస్వాములు కావాలన్నారు. తాగునీటి లీకేజీ కనిపిస్తే 7422992299 నంబర్కు సమాచారం ఇవ్వాలన్నారు.