పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
BHNG: చౌవుళ్ళ రామారంలో ఇవాళ పశువులకు ఉచితంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువైద్యాధికారి అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పశువుల ఆరోగ్యంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ ఉచిత అవకాశాన్ని పాడి రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మందుల కిరణ్, రైతులు పాల్గొన్నారు.