కేజీహెచ్ ఘటనపై వాసుపల్లి ఆగ్రహం

కేజీహెచ్ ఘటనపై వాసుపల్లి ఆగ్రహం

విశాఖ కేజీహెచ్‌లో మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని ఆదివారం మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మార్చురీ వద్ద కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్యశాఖ నిర్లక్ష్యానికి కూటమి ప్రభుత్వమే కారణమని విమర్శించారు. బాలుడి కుటుంబానికి ప్రభుత్వం రూ.20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.