నారాయణస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని మిట్టపాలెం గ్రామంలో కలిసి ఉన్న నారాయణస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు స్వామివారికి పొంగళ్ళు నైవేద్యంగా పెట్టి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఆలయ ఈవో గిరిరాజు భక్తులకు వసతులు సమకూర్చారు.