VIDEO: జెండా ఊపి రైలును ప్రారంభించిన కేంద్ర మంత్రి
శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్ వద్ద శ్రీకాకుళం నుంచి తిరుపతికి వెళ్లే “హంసఫర్” ఎక్స్ప్రెస్ రైలును కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జెండా ఊపి సోమవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని అన్నారు. తిరుపతి వెళ్లే భక్తులకు ఎంతో సౌలభ్యం కలుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రవికుమార్ పాల్గొన్నారు.